ఇక రైతుల ఉద్యమంపై ఉక్కుపాదమేనా..!?



వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులుచేస్తున్న ఉద్యమం హింసాత్మకమయింది. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత మంది పోలీసులపై దాడులు చేశారు. రాళ్లేశారు. మొత్తంగా విధ్వంసం జరిగింది. హింసాత్మకం అయింది. ఇప్పటి వరకూ రెండు నెలల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ఎప్పుడూ పడని మరక పడింది. దీనిపై రైతు సంఘాలు బీజేపీ పై.. బీజేపీ నేతలు రైతు సంఘాలపై […]