నిమ్మగడ్డతో బదిలీల గేమ్ ఆడుతున్న ప్రభుత్వం ..!
పంచాయతీ ఎన్నికల విషయంలో లేని పోని పంతాలకు పోయి తల బొప్పి కట్టించుకున్న ఏపీ ప్రభుత్వం కొత్తగా… ఎస్ఈసీతో బదిలీల గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ను ఎస్ఈసీ బదిలీ చేయమన్నారని.. సీఎస్ బదిలీ చేసేశారని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే వాస్తవానికి ఎస్ఈసీ బదిలీ చేయమన్నది… ద్వివేదీ, గిరిజాశంకర్లను కాదు. గతంలో చెప్పినట్లుగా ఇద్దరు ఎస్పీలతో సహా తొమ్మిది మంది అదికారులను బదిలీ చేయమన్నారు. ముందు వారిని […]