రైతుల పాదయాత్ర సెగ – వైసీపీ కొత్త ప్లాన్లు !



అమరావతి రైతుల పాదయాత్రకు పెద్ద ఎత్తున జన స్పందన వస్తూండటంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. అది టీడీపీ యాత్ర అని ఎంతగా ప్రచారం చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. పాదయత్ర ఎక్కువగా గ్రామాల గుండానే వెళ్తోంది. ప్రతీ గ్రామంలోనూ రైతులకు అక్కడి రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారు. రైతుల పాదయాత్రకు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. పార్టీలు, ప్రజాసంఘాలు.. ఇలా అన్నీ రాజధానికి మద్దతు ప్రకటించాయి. దీంతో వైసీపీలో వణుకు ప్రారంభమయింది. […]