“నిపుణులు” ఇప్పటికీ అమాయకులుగానే కనిపిస్తున్నారా..!?



భారతదేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ… అంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య పరస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే నిపుణుల కమిటీ హెచ్చరించింది. అయితే ఆ నిపుణుల్ని అమాయకుల కేటగిరి కింద జమ చేర్చేసిన కేంద్రం లైట్ తీసుకుంది. ఫలితంగా ఇండియా ఇప్పుడు కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. […]