అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !



అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో వారిద్దరూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదని అధికారపక్షం ఈ ప్లాన్ వేసినట్లుగా టీడీపీ అనుమానిస్తోంది. గతంలో అసెంబ్లీలో నిమ్మల రామానాయుడును సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామానాయుడు అని పదే పదే సంబోధించారు. దీనికి రామానాయుడు తాను డ్రామానాయుడు […]