అధికార పార్టీ ప్రాంతీయ గర్జనలు -వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !



వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఆశలు వదిలేసినట్లుగా.. రాయలసీమపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అక్కడి ప్రజల్లో సీమ సెంటిమెంట్ ఎంత రెచ్చగొడితే అంత మేర లాభమని అనుకుంటున్నారు. ఐదో తేదీన ఏకంగా రాయలసీమ గర్జన పెడుతున్నారు. ఎందుకీ గర్జనో అధికార పార్టీ చెప్పలేదు., ఎందుకంటే… హైకోర్టు కర్నూలులో పెట్టాలంటే అధికార పార్టీనే చేయాలి. కానీ టీడీపీ పై రెచ్చగొట్టడానికి ఈ సభ ఏర్పాటు చేస్తన్నారు. రాయలసీమలో వైసీపీకి గరిష్ట స్థాయిలో సీట్లు ఉన్నాయి. […]