ఆశ కాదు… అవ‌స‌రం: ముఖ్య‌మంత్రుల‌కు చిరు విన్న‌పం



చిత్ర‌సీమ సంక్షోభంలో ఉందిప్పుడు. క‌రోనా కాటుకి ప‌రిశ్ర‌మ పూర్తిగా కుదేలైపోయింది. మ‌ళ్లీ తేరుకోవ‌డానికి ఎన్నాళ్లు ప‌డుతుందో తెలీదు. ఇప్పుడు చిత్ర‌సీమ‌ని ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది. ఇదే విష‌యాన్ని.. చిరంజీవి గుర్తు చేశారు. `ల‌వ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి చిరు అతిథిగా విచ్చేశారు. ఈ వేదిక‌పై నుంచి చిరు.. చిత్ర‌సీమ‌ని ఆదుకోవాలంటూ ప్ర‌భుత్వాల్ని కోరారు. చిత్ర‌సీమ అంటే ఐదుగురు ద‌ర్శ‌కులు, ఐదుగురు హీరోలు కాద‌ని, కొంత‌మంది బాగా సంపాదించినంత మాత్రాన ప‌రిశ్ర‌మ ప‌చ్చ‌గా ఉన్న‌ట్టు […]