కడపలో పేలుళ్లు.. పది మంది దుర్మరణం..!
రాష్ట్రమంతా కరోనా కారణంగా బిక్కుబిక్కుమంటూంటే.. కడప జిల్లాల్లో పేలుళ్ల మోత మోగిపోయింది. కలసపాడు మండలం మామిళ్లపల్లి దగ్గర ఉన్న ముగ్గురాయి గనిలో ఒక్క సారిగా పేలుళ్లు సంభవించాయి. పది మంది చనిపోయారు. పది మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. వారి శరీరాలు తునాతునకలయ్యాయి. అవి జిలెటిన్ స్టిక్స్అని అధికారులు చెబుతున్నారు. అయితే జిలెటిన్ స్టిక్స్ పేలితే అంత తీవ్రంగా ప్రభావం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గనుల్లో పేలుళ్లుకు జిలెటిన్ స్టిక్స్కు అనుమతులు ఉన్నాయో లేదో.. క్లారిటీ […]