టీఆర్ఎస్ గ్రానైట్ కింగ్లకు సీబీఐ కష్టాలు కూడా !
గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ, ఈడీ నోటీసులు జారీ చేసి..సోదాలు చేస్తే..ఇప్పుడు సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. గురువారం ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. గ్రానైట్లో చేసినవన్నీ ఆర్థిక అవకతవకలు.. మరి సీబీఐ ఎందుకు అంటే.. ఈ కేసుల్లోనుంచి బయటపడేందుకు వీరు తెర వెనుక ప్రయత్నాలు చేసి దొరకిపోయినట్లుగా వివరాలు బయటకు రావడమే. మూడు రోజుల కిందట.. కొవ్విడి […]