రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు



రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా సాయి చరణ్ అనే బాలుడు వారి పాలిట ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. దట్టమైన మంటలు చెలరేగుతున్నా సమయస్పూర్తిని ప్రదర్శించి యాభై మంది ప్రాణాలను కాపాడాడు. ఫార్మా కంపెనీ సమీపంలో నివసించే సాయి చరణ్ అనే బాలుడు స్థానికంగా చెలరేగిన మంటలను గమనించాడు. […]