సమైక్య రాష్ట్రం చేసేందుకు మళ్లీ చంద్రబాబు కుట్రట !



టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్లీ .. సమైక్య వాదుల కుట్రనడం ప్రారంభించేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏడాదిగా కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని.. పదవి నుంచి దించేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపి మళ్లీ సమైక్య రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని గుత్తా అంటున్నారు. కేసీఆర్‌‌ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు వారు మూకుమ్మడి దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి […]